ఎపిలో నేడు కొత్తగా 207 క‌రోనా కేసులు

5,673కి పెరిగిన పాజిటివ్స్

207 new corona cases in AP today
207 new corona cases in AP today

Amaravati: ఎపిలో క‌రోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నాయి.. నేడు కొత్త‌గా 207 కేసులు న‌మోదు అయ్యాయి.

వాటిలో వివిధ జిల్లాల‌కు చెందిన వారు 141 మంది, వ‌ల‌స కూలీలు 64 మంది, విదేశాల నుంచి వచ్చిన ఇద్ద‌రికి కి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఎపిలో న‌మోదైన కేసులు సంఖ్య 5673కి పెరిగింది..

వాటిలో 13 జిల్లాల‌లో 4402 కేసులు, విదేశాల నుంచి వ‌చ్చిన 199 కేసులు, వ‌ల‌స కూలీల 1035 కేసులున్నాయి..

ఎపిలో ఇప్ప‌టి వ‌ర‌కు 80 మంది మ‌ర‌ణించారు…

ఇప్పటివరకు 2వేల 599 మంది వివిధ జిల్లాలోనూ, వ‌ల‌స కూలీలు 471 మంది, ఎన్నాఆర్ ఐలు 21 మంది కోలుకుని హాస్ప‌ట‌ల్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు..

ప్ర‌స్తుతం జిల్లాలో 1723 యాక్టివ్ కేసులు ఉండ‌గా, విదేశాల నుంచి వ‌చ్చిన 178 మంది, వ‌ల‌స కూలీలు 564 మంది వివిద హాస్ప‌ట‌ల్స్ లో చికిత్స పొందు‌తున్నారు..

తాజా ఎన్నారై వార్తల కోసం :https://www.vaartha.com/news/nri/