ఏపీలో మరో 1916 కొత్త కేసులు నమోదు

ఒక్కరోజులో 43 మంది మృతి

corona virus -ap

అమరావతి : ఏపీలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతుంది. రాష్టంలో కొత్తగా 1916 కరోనా కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ తెలిపింది. అదే సమయంలో 43 మంది మృతి చెందారు. ఏపీలో ఇప్పటి వరకు మొత్తం 33,019 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 15,144 మంది వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతుంటే, 17,467 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు కరోనాతో 408 మంది చనిపోయారు. ఇప్పటివరకూ ఏపీలో ప్రభుత్వం 1195766 టెస్టులు చేసినట్లు తెలిపింది. ఏపీలో 12739 మంది ఆస్పత్రుల్లో, మరో 2405 మంది కొవిడ్ కేర్ సెంటర్లలో ట్రీట్‌మెంట్ పొందుతున్నారు. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 15144గా నమోదైంది.

జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు..

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి :https://www.vaartha.com/news/national/