ఎపిలో నేడు కొత్తగా 182 కేసులు

5,466కి పెరిగిన కరోనా పాజిటివ్స్

Corona cases updates in AP
Corona cases updates in AP

Amaravati: ఎపిలో క‌రోనా కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతున్నాయి.. నేడు కొత్త‌గా 182 కేసులు న‌మోదు అయ్యాయి.

వాటిలో వివిధ జిల్లాల‌కు చెందిన వారు 135 మంది, వ‌ల‌స కూలీలు 38 మంది, విదేశాల నుంచి వచ్చిన 9 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది.

దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఎపిలో న‌మోదైన కేసుల సంఖ్య 5466 కి పెరిగింది.. వాటిలో 13 జిల్లాల‌లో 4261 కేసులు, విదేశాల నుంచి వ‌చ్చిన 197 కేసులు, వ‌ల‌స కూలీలు 971 కేసులున్నాయి..

ఇక నేడు తూర్పు గోదావ‌రి జిల్లాలో, కృష్ణా జిల్లాలో ఒక్కొక్క‌రు మ‌ర‌ణించారు.. ఎపిలో ఇప్ప‌టి వ‌ర‌కు 80 మంది మ‌ర‌ణించారు.

ఇప్పటివరకు 2వేల 540 మంది వివిధ జిల్లాల‌లోనూ, వ‌ల‌స కూలీలు 407 మంది, ఎన్నారైలు 21 మంది కోలుకుని హాస్ప‌ట‌ల్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు..

ప్ర‌స్తుతం జిల్లాల‌లో1641 యాక్టివ్ కేసులు ఉండ‌గా, విదేశాల నుంచి వ‌చ్చిన 176 మంది, వ‌ల‌స కూలీలు 564 మంది వివిద హాస్ప‌ట‌ల్స్ లో చికిత్స పొందు‌తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/