ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు
ఏపి టిడిపి నేత కళా వెంకట్రావు
అమరావతి: వైయస్ఆర్సిపి ప్రభుత్వంపై ఏపి టిడిపి నేత కళా వెంకట్రావు విమర్శలు గుప్పించారు. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను రద్దు చేసి పేద మహిళల పుస్తెలు తెంచే మద్యం దుకాణాలను తెరిచారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న ఈ సమయంలో మద్యం దుకాణాలు తెరచి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. సిఎం జగన్లో నాయకుడికి ఉండాల్సిన ఒక్క లక్షణం కూడా లేదని విమర్శించారు. అధికారంలోకి ఏడాదిలోనే రాష్ట్రాన్ని పదేళ్లు వెనక్కి తీసుకువెళ్లారని అన్నారు. మూడు రాజధానుల పేరుతో వైయస్ఆర్సిపి నేతలు కబ్జాలు,దౌర్జన్యాలకు దిగుతున్నారని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హమీలలో ఒక్కటి కూడా నిలబెట్టుకోకుండా.. నవరత్నాలు అని నవ మోసాలకు పాల్పడ్డారని అన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/