నిమ్మగడ్డ పిటీషన్ విచారణ రేపటికి వాయిదా
అమరావతి: ఏపిలో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పదవీకాలాన్ని ఐదు సంవత్సరాల నుండి 3 సంవత్సరాలకు కుదిస్తు ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావడంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ వ్యవహరంపై రమేష్కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ను స్వీకరించిన న్యాయస్థానం ఇప్పటికే పలు దఫాలుగా వాదనలు విన్నది. తాజాగా జరిగిన విచారణలో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ అంశంలో మరికొన్ని పిటీషన్లు ఉన్నందున రేపటి విచారణలో వారి వాదనలు కూడా వినాలని హైకోర్టు భావిస్తోంది.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/sports/