అజాగ్రత్తగా ఉంటే పరిస్థితి మన చేతుల్లో ఉండదు
అమరావతి: కేంద్రం ఇచ్చిన సడలింపులతో నిన్న రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలొ మద్యం దుకాణాలు తెరవవద్దు అంటూ పలుచోట్ల మహిళలు ఆందోళనలు చేశారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో మద్యం కారణంగా పలు చోట్ల హత్యలు, ఆత్మహత్యలు జరిగాయని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఆరుగురు చనిపోయారని అన్నారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో కరోనాను ఎలా కట్టడివ చేస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పరిస్థితి మన చేతుల్లో ఉండదు, క్రమశిక్షణగా ఉండి మనల్ని మనం కాపాడుకోవాలని అన్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/