రోజు రోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు
24 గంటల్లో 3,309 నమోదు
Amaravati: ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. 24 గంటల్లో 3,309 కొత్త కేసులు నమోదయ్యాయి. 11 మంది మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో ముగ్గురు, నెల్లూరు, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందగా..అనంతపురం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో 740 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 527, విశాఖ లో 391, కర్నూలు లో 296 కేసులు నమోదయ్యాయి.ఇప్పటివరకు కరోనాతో 7,291 మంది మృతి చెందారు
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/