వేలం వేయనున్న ఏపి ప్రజావేదిక సామాగ్రి

ఇప్పుడు వేలం వేస్తే పది శాతం కూడా రాదన్న నక్కా ఆనంద్‌ బాబు

AP Praja vedika
AP Praja vedika

అమరావతి: ఏపిలోని ప్రజావేదిక ఫర్నీచర్‌ను వేలం వేయాలని ఏపి ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఆసక్తి ఉన్న వారిని దరఖాస్తు చేసుకోవల్సిందిగా సిఆర్‌డిఏ సూచించింది. వైఎస్‌ జగన్‌ సిఎం అయిన వెంటనే అక్రమ కట్టండంగా గుర్తించి ప్రజావేదికను కూల్చివేశారు. అయితే అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలోని క్యాంప్‌ కార్యాలయంగా ప్రజావేదికనను ఉపయోగించుకున్న విషయం తెలిసిందే. కాగా ఆసక్తి ఉన్న బిడ్డర్లు వచ్చే నెల మూడో తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆ తర్వాతి రోజు వేలం నిర్వహిస్తామని ప్రకటించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు రూ. 9 కోట్ల వ్యయంతో ప్రజా వేదికను నిర్మించారు. కానీ, సీఎం జగన్ ఆదేశాలతో గతేడాది జూన్‌లో దీన్ని కూల్చివేసిన సిఆర్‌డిఏ.. ఏసీలు, కుర్చీలు, టేబుళ్లు సహా పలు విలువైన వస్తువులను అక్కడే వదిలేసింది. ఇప్పుడు వాటిని వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించింది.
ప్రజా వేదికలో మిగిలిపోయిన సామగ్రిని వేలం వేయాలన్న నిర్ణయంపై టీడీపీ సీనియర్‌‌ నాయకుడు నక్కా ఆనంద్ బాబు స్పందించారు. అయితే, ప్రజా వేదిక కూల్చివేసిన ఎనిమిది నెలల తర్వాత అందులోని సామగ్రిని వేలం వేయడాన్ని తప్పుబట్టారు. కూల్చిన వెంటనే ఈ పని చేస్తే కొన్ని కోట్ల రూపాయలైనా వచ్చేవన్నారు. ఇప్పుడు అందులో పది శాతం కూడా రాదని అభిప్రాయపడ్డారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/