అమరావతి అంశంపై అసెంబ్లీలో బుగ్గన వివరణ

అమరావతిలో లెజిస్లేటివ్‌.. విశాఖలో రాజ్‌భవన్‌

Buggana Rajendranath
Buggana Rajendranath

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ప్రవేశ పెట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజమహల్స్‌ వంటి భవనాలు రాష్ట్రానికి అవసరం లేదు. ప్రజలకు కావాల్సింది వసతులు, భద్రత. ప్రజలెవరూ రాజభవనాలు కోరుకోవట్లేదు’ అని అన్నారు. ‘కర్నూలులో జ్యుడీషియల్ రాజధాని. కర్నూలులోనే న్యాయపరమైన అన్ని శాఖలు. హైకోర్టు అనుమతి తర్వాత ఇవి ఏర్పాటు చేస్తాం. ఇది చారిత్రాత్మక బిల్లు. అమరావతిలోనే లెజిస్లేటివ్ రాజధాని, విశాఖలో రాజ్‌భవన్‌, సచివాలయం. పన్ను కట్టే ప్రతివారికి న్యాయం చేయాలి. పరిపాలన అభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి కోసమే ఈ బిల్లు. సమ్మిళిత అభివృద్ధి మన లక్ష్యం’ అని బుగ్గన రాజేంద్ర నాథ్ తెలిపారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/