విమాన ప్రయాణంలో యాంకర్ అనసూయకు చేదు అనుభవం
సినీ స్టార్స్ ఎక్కువగా విమాన ప్రయాణాలు చేస్తుంటారు. ఈ క్రమంలో వారికీ అప్పుడప్పుడు విమాన సంస్థల నుండి చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. వాటిని సోషల్ మీడియా లో వ్యక్తం చేస్తుంటారు. ఇలా చాలామంది నటి నటులకు ఎదురయ్యాయి. తాజాగా ప్రముఖ యాంకర్ , నటి అనసూయ కు కూడా ఎదురైంది. ఈ విషయాన్నీ ఆమె సోషల్ మీడియా వేదికగా తెలియజేసి సదరు సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆమె తెలిపిన దాని ప్రకారం..‘‘అలయన్స్ ఎయిర్ 9I 517 విమానం ప్రొటో కాల్తో చాలా సిక్ అయిపోయాను. ఫ్లైట్ నెం. బెంగుళూరు నుంచి హైదరాబాద్ వెళ్లే 9I 517 మమ్మల్ని సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు పరుగులు పెట్టించారు. విమానం లాస్ట్ కాల్ 6.20 గంటలకు అని అనౌన్స్ చేశారు. అయితే విమానం బోర్డింగ్ టైమ్ 18.55 అని టికెట్లో ఉండింది. విమానం టేకాఫ్ టైమ్ 19.25 గంటలు. బస్సులో మేం అరగంట పాటు వెయిట్ చేశాం. ఫ్లైట్ ఆగి ఉండగానే మా పిల్లలతో పరుగులు పెట్టాను. ఇంత ప్రయాస పడి వెళ్లిన తర్వాత ఫ్లైట్ గేటు దగ్గరున్న సెక్యూరిటీ మాస్క్ లేకుండా లోపలికి పంపనన్నాడు. చివరకు మాస్క్ లేకుండానే ఫ్లైట్ ఎక్కాం. తర్వాత మాస్క్ కచ్చితంగా ధరించాల్సిన అవసరం లేదని అంటున్నారు. అంత కన్ఫ్యూజన్ ఎందుకు. తీరా ఫ్లైట్ ఎక్కిన తర్వాత కూడా ఇబ్బందులే. మేం ఫ్యామిలీగా నాలుగు టికెట్స్ బుక్ చేస్తే వేర్వేరు చోట్ల నాలుగు టికెట్స్ ఇచ్చారు. సీటుకు తగులుకుని దాదాపు నా షర్ట్ చిరిగిపోయింది. మీ ప్రయాణీకులకు చెప్పే ముందు మీరు సరిగ్గా ఉండండి’’ అంటూ అనసూయ మెసేజ్ షేర్ చేశారు. మరి దీనిపై సదరు సంస్థ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.