అనసూయ సంచలన నిర్ణయం..షాక్ లో ఫ్యాన్స్

బుల్లితెర, వెండితెర ఫై రాణిస్తున్న అనసూయ..సంచలన నిర్ణయం తీసుకుంది. రీసెంట్ గా జరిగిన ‘మా’ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానల్ తరుపున ఈసీ మెంబర్ గా పోటీ చేసింది. ముందు ఈమె భారీ మెజార్టీ లో ఉన్నదని..గెలిసిందనే వార్తలు వచ్చాయి. కానీ చివర్లో మాత్రం ఓడిపోయిందని తెలిపారు. దీంతో అంత షాక్ అయ్యారు. ఈ రిజల్ట్ తో అనసూయ సంచలన నిర్ణయం తీసుకుంది.

ఇంకా ఆమె మళ్లీ ఎప్పుడు కూడా ఏ రాజకీయంలో కూడా ఇన్వాల్వ్ అవ్వను అంది. రాజకీయాల్లో నిజాయితీగా ఉండటం కరెక్ట్ కాదని చెప్పుకొచ్చింది. నాకు ఇలాంటి వాటికి టైమ్ లేదు. నా పిల్లలతో మరియు పనితోనే బిజీగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది. మళ్లీ ఎప్పుడు కూడా ఇలాంటి ఎన్నికల్లో పోటీ చేయను అంటూ అనసూయ ట్వీట్ చేసి అందరికి షాక్ ఇచ్చింది.

అనసూయ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొందరు తప్పుబడుతున్నారు. ఇంత చిన్న ఓటమికే అంత పెద్ద నిర్ణయం తీసుకోవడం ఏంటీ అనసూయ అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే కొందరు మాత్రం మంచి నిర్ణయం తీసుకున్నావు అమ్మడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.