కృష్ణపట్నం ఆనందయ్య కొత్త పార్టీ పెట్టబోతున్నాడు

కరోనా వైరస్ మహమ్మారి విజృంభించిన సమయంలో ఆయుర్వేదం మందు తయారు చేసి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన కృష్ణపట్నం ఆనందయ్య..తాజాగా పెద్ద బాంబు పేల్చాడు. త్వరలో రాజకీయ పార్టీ ప్రారంభించబోతున్నట్లు తెలిపి పెద్ద షాక్ ఇచ్చాడు. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఆనందయ్య రధయాత్ర చేయనున్నారు. ఆ తర్వాత పార్టీని పెట్టె అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అన్ని కులాలను కలుపుకుని పార్టీ పెట్టాలనే యోచనలో ఆయన ఉన్నట్టుగా సమాచారం.

కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో.. ఆయుర్వేద మందు తయారీ చేసి ఆనందయ్య వార్తల్లో నిలిచారు. దేశ వ్యాప్తంగా ఆనందయ్య మందు కోసం నెల్లూరు కు పరుగులు పెట్టారు. ఆనందయ్య మందు కొంతకాలం ఆగిపోయిన.. మొత్తానికి ఏపీ సర్కార్‌ అనుమతి ఇవ్వడంతో మందు పంపిణీ మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే జగన్ ప్రభుత్వం నుంచి సహకారం లేదని కొన్ని సార్లు ఆవేదన వ్యక్తం చేసినా.. 13 జిల్లాల్లో కూడా ఆయుర్వేదం మందును పంపిణీ చేశారు. ఇక ఇప్పుడు కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు తెలిపి మరోసారి వార్తల్లో నిలిచారు.