పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే

జగన్‌మోహన్‌రెడ్డి వచ్చినప్పుడు వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలు రారా?

vasupalli ganesh
vasupalli ganesh

విశాఖపట్టణం: ఎయిర్‌ పోర్టు దగ్గర టిడిపి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ను, టిడిపి కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. వారితో వాగ్వాదానికి దిగారు. తాము ఎవరిపై దాడి చేయడం లేదని, తమ అధినాయకుడు చంద్రబాబు నాయుడు వస్తున్న సందర్భంగా ఎయిర్‌పోర్టుకు స్వాగతం పలికేందుకు వచ్చామన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి వచ్చినప్పుడు వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలు రారా ? అని ప్రశ్నించారు. వారిని కూడా ఇలాగే అడ్డుకుంటారా? అని పోలీసులపై ధ్వజమెత్తారు. విజయనగరంలో జరిగే ప్రజా చైతన్య యాత్రలో పాల్గొనడానికి చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో..విశాఖ విమానాశ్రయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబును అడ్డుకోవడానికి వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. చంద్రబాబు గో బ్యాక్‌ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/