ఒక దీక్ష.. ఒక విజయం.. ఒక యాది.: కేటీఆర్

హైదరాబాద్ : అది 2009 సంవ‌త్స‌రం, తెలంగాణ వాదులంతా ప్ర‌త్యేక రాష్ట్రం కోసం ఎదురుచూస్తున్న స‌మ‌యం.. అప్ప‌టికే కేసీఆర్ దీక్ష చేపట్టారు. తెలంగాణ ఉద్యమం చివరి దశకు చేరిన సమయంలో కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో కేసీఆర్ ఆ దీక్షలో ఉండి కొన్ని రోజులు అవుతుండగా ఆయన ఆరోగ్య పరిస్థితి సైతం రోజురోజుకు విషమిస్తుంది.. ఓవైపు కేసీఆర్ దీక్ష చేప‌ట్టి ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి విష‌మిస్తుండ‌డంతో ఏమ‌వుతుందోన‌ని అంద‌రూ కేసీఆర్ కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. అయితే అప్పటి యూపీఏ ప్రభుత్వంలోని కేంద్ర మంత్రి చిందబరం ప్ర‌త్యేక‌ తెలంగాణ ఏర్పాటు పై కీలక ప్రకటన చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ప్రక్రియను ప్రారంభించామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అది ఎప్పుడంటే 2009 డిసెంబర్ 9.. అందుకే ఆ తేదీకి… తెలంగాణకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

ఈ సంఘటన జరిగి 12 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా మంత్రి కేటీఆర్‌.. కేసీఆర్‌ దీక్షపై వచ్చిన ఓ పేపర్‌ క్లిప్పింగ్‌ను ట్వీట్‌ చేస్తూ.. ఆ ట్వీట్‌లో ఇలా రాశారు. ఒక దీక్ష.. ఒక విజయం.. ఒక యాది. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్‌ సచ్చుడో.. అన్న ఉద్యమ వీరుని ప్రస్థానానికి నేటితో పన్నెండేండ్లు.. జై కేసీఆర్‌.. జై తెలంగాణ అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/