ఆఫ్రికా బంగారు గనిలో పేలుడు-59 మంది మృతి
100 మందికి పైగా గాయాలు
ఆఫ్రికాలోని బుర్కినా ఫాసోలో విషాదం చోటుసుకుంది. ఇక్కడి బామ్ బ్లోరా గ్రామంలో బంగారు గనిలో భారీ పేలుడు సంభవించింది. ఈదుర్ఘటనలో ఇప్పటివరకు 59 మంది మృతి చెందినట్టు తెలిసింది. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. బంగారాన్ని శుద్ధిచేసే రసాయనాల కారణంగా పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లా చెదురుగా పడిపోయాయి. తొలి పేలుడు రాత్రి 2 గంటల సమయంలో జరిగిందని అధికారిక సమాచారం .
జాతీయ వార్తల కోసం :https://www.vaartha.com/news/national/