తండ్రి అంత్యక్రియలకు వస్తానంటున్న అమృత

రక్షణ కావాలని పోలీసులను కోరిన అమృత

Amrutha-Maruti Rao
Amrutha-Maruti Rao

హైదరాబాద్‌:  ప్రణయ్ హత్యకేసు నిందితుడు మారుతీరావు హైదరాబాద్‌లో ఆర్యవైశ్య భవన్‌ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యలో మారుతీరావు కుమార్తె అమృత తన తండ్రిని కడసారిగా చూడాలని అనుకుంటున్నానని, అందుకు పోలీసుల సహకారం కావాలని కోరింది. ఈ మేరకు ఆమె మిర్యాలగూడ అధికారులకు సమాచారాన్ని పంపింది. తన తండ్రిని చూడాలని భావిస్తున్నానని, అక్కడికి వెళితే, తనపై దాడి జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో భద్రత కల్పించాలని ఆమె కోరడంతో పోలీసులు అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అమృత రావాలని అనుకుంటున్న విషయాన్ని మారుతీరావు దగ్గరి బంధువులకు తెలియజేస్తామని, వారి అభిప్రాయం తీసుకున్న తరువాత తుది నిర్ణయం తీసుకుంటామని పోలీసులు అంటున్నారు. తన తండ్రి అంత్యక్రియలకు వస్తానని అమృత చేసిన విజ్ఞప్తిపై ఇప్పటివరకూ ఆమె తల్లి స్పందించలేదని తెలుస్తోంది. తన కుటుంబం ఇలా కావడానికి కారణం అమృతేనన్న ఆగ్రహంతో ఆమె ఉన్నట్టు కొందరు బంధువులు వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో అమృత వచ్చేందుకు ఆమె బాబాయ్ నిరాకరించాడని సమాచారం. ఆమె వస్తే, తన సోదరుడి ఆత్మ శాంతించబోదని ఆయన అన్నట్టు తెలుస్తోంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/