తండ్రిని ఆఖరి చూపు చూడలేకపోయిన అమృత
తండ్రి మృతదేహాన్ని చూడకుండా అడ్డుకున్న బంధువులు, స్థానికులు
మిర్యాలగూడ: నల్గొండ జిల్లాలో సంచలనంగా మారిన పరువు హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు నిన్న హైదరాబాద్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఆయన అంత్యక్రియలు మిర్యాలగూడలో నిర్వహిస్తున్నారు. తన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అక్కడికి అమృతతో పాటు, ప్రణయ్ కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. అయితే అక్కడ అమృతకు స్థానికులు షాకిచ్చారు. అమృతను చూడగానే అక్కడి వారంతా అడ్డగించారు. ఆమె ప్రయత్నించినా మారుతీరావు కుటుంబ సభ్యులు, స్థానికులు అంగీకరించకపోవడంతో తన తండ్రిని ఆఖరి చూపు చూడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయింది. కాగా మారుతీరావు అంతిమయాత్రలో స్థానిక ఎమ్మెల్యె భాస్కర్ రావు, మున్సిపల్ చైర్మన్ భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/