రైతులతో చర్చలకు అమిత్‌ షా పిలుపు

సాయంత్రం 7 గంటలకు రైతులతో అమిత్ షా చర్చలు

Amit Shah
Amit Shah

న్యూఢిల్లీ: కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలంటూ రైతులు చేపట్టిన ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరాయి. ఈ రోజు ప్రజలకు ఇబ్బంది కలగకుండా నాలుగు గంటల పాటు భారత్ బంద్ చేపట్టారు. అయితే, ఇప్పటి వరకు రైతు నేతలతో కేంద్ర జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. రైతులతో చర్చలకు సిద్ధమయ్యారు.

చర్చలకు రావాల్సిందిగా అమిత్ షా నుంచి పిలుపు వచ్చినట్టు రైతు నేత రాకేశ్ తెలిపారు. అమిత్ షా నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని… చర్చలకు రావాలని ఆయన తమను ఆహ్వానించారని రాకేశ్ చెప్పారు. మంగ‌ళ‌వారం సాయంత్రం 7 గంటలకు సమావేశం జరగనుందని తెలిపారు. ఢిల్లీ చుట్టుపక్కల జాతీయ రహదారులపై నిరసనలు తెలుపుతున్న రైతు నేతలందరూ ఈ చర్చలకు హాజరవుతారని చెప్పారు.

మంగ‌ళ‌వారం రైతులు పిలుపునిచ్చిన బంద్‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాలైన కాంగ్రెస్‌, ఎన్సీపీ, ఆమ్ ఆద్మీ, డీఎంకే, టీఆరెస్ మ‌ద్ద‌తు తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో ఉద‌యం 11 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు బంద్ ప్ర‌శాంతంగా ముగిసింది. 


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/