బెంగాల్‌లో రెండు రోజులు పర్యటించనున్న అమిత్ షా

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. 2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి ఆయన బెంగాల్‌లో పర్యటిస్తున్నారు. రెండ్రోజుల పర్యటన నిమిత్తం ఆయన పశ్చిమ బెంగాల్ వెళ్లారు. పార్టీ సమావేశాలతో పాటు బహిరంగ సభల్లో అమిత్ షా పాల్గొంటారు. భారత్, బంగ్లా సరిహద్దుల వెంబడి ఆయన ప్రయాణించనున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/