టిక్టాక్పై అమెరికా దిగ్గజ సంస్థ కన్ను
ప్రముఖ సోషల్ వీడియో సంప్రదింపులు
న్యూఢిల్లీ: వివాదాస్పద చైనా షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్ టిక్టాక్ కొనుగోలు రేసులో అమెరికాకు చెందిన మరో దిగ్గజ సంస్థ నిలిచింది.
ప్రముఖ సోషల్ వీడియో ప్లాట్ఫామ్ ట్రిల్లర్ చైనాకు చెందిన బైట్డాన్స్ను సంప్రదించినట్లు తెలుస్తోంది. లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రసిద్ధ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ సెంట్రికస్ ద్వారా 20 బిలియన్ డాలర్ల బిడ్తో సంప్రదించినట్లు రాయిటర్స్ శనివారం తెలిపింది.
అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, భారతదేశంలోని టిక్టాక్ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు యోచిస్తున్నట్లు పేర్కొంది. టిక్టాక్ కాకుండా టిక్టాక్ యాజమాన్య సంస్థ బైట్డాన్స్కు నేరుగా బిడ్చేసినట్లు ట్రిల్లర్ వెల్లడించింది.
సెంట్రికస్ ద్వారా బైట్డాన్స్ చైర్మన్కు నేరుగా ఆఫర్ను సమర్పించామనీ, స్వీకరణ ధృవీకరణ కూడా తమకు చేరిందని ట్రిల్లర్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బాబీ సర్నెవెస్ట్ చెప్పారు.
డైరెక్టుగా చైర్మన్తోనే సంప్రదింపులు జరుపుతున్నామన్నారు.
అయితే ఈ వార్తలను టిక్టాక్ తోసిపుచ్చింది. అలాంటి ఆఫర్ను అందుకోలేదని తెలిపింది. దీంతో ఈ వ్యవహారంలో గందరగోళం నెలకొంది.
టిక్టాక్ మాతృసంస్థ బైట్డాన్స్ తన అమెరికా, కెనడియన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కార్యకలాపాలను విక్రయించే ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్దేశించిన 90 రోజుల గడువు లోపల ఒక ఒప్పందానికి రావాలని భావిస్తోంది.
సుమారు 20నుంచి 30 బిలియన్ డాలర్ల పరిధిలో డీల్ ఖాయం చేసుకోవాలని భావిస్తోంది.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/