డోనాల్డ్ ట్రంప్ దంప‌తుల‌కు క‌రోనా

ట్విట్టర్‌లో తెలిపిన ట్రంప్

Trump- Melania Trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు ఆయన భార్య మెలానియా ట్రంప్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ట్రంప్ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా ప్రకటించారు. ‘ఈ రోజు రాత్రి మెలానియాతో పాటు నాకు కరోనా నిర్ధారణ అయింది. మేమిద్దరం క్వారంటైన్‌లో ఉండనున్నాం.. కరోనా నుంచి కోలుకునేందుకు చికిత్స తీసుకుంటాం’ అని ట్రంప్ వివరించారు. ట్రంప్ త్వరగా కోలుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

కాగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రధాన సలహాదారు హోప్ హిక్స్ కు కరోనా సోకినట్లు ఇప్పటికే తెలిసిన విషయం విదితమే. ఆమె అస్వస్థతకు గురి కావడంతో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో ట్రంప్‌ కుటుంబసభ్యులకు కూడా కరోనా పరీక్షలు చేశారు.  ఇటీవ‌ల డోనాల్డ్ ట్రంప్‌తో క‌లిసి హిక్స్ అనేక‌సార్లు ప్ర‌యాణం చేశారు.  రెండు రోజుల క్రితం ఓహియాలోని క్లీవ్‌లాండ్‌లో జ‌రిగిన తొలి డిబేట్‌కు కూడా ట్రంప్‌తో క‌లిసి హిక్స్ వెళ్లారు. మాస్క్ లేకుండానే అధ్య‌క్ష భ‌వ‌న సిబ్బంది ఆమెతో గ‌డిపిన‌ట్లు తెలుస్తోంది. 


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/