చంద్రబాబు కుప్పం టూర్ పై అంబటి సెటైర్లు
పదే పదే కుప్పం వెళ్తున్న చంద్రబాబు అంటూ వ్యాఖ్య
అమరావతిః ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సోషల్ మీడియా వేదికగా టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు పై సెటైర్లు వేశారు. చంద్రబాబునాయుడు బుధవారం తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకు బయలుదేరిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి విమానం ద్వారా బెంగళూరు చేరిన చంద్రబాబు… అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కుప్పం చేరుకున్నారు. బుధవారం నుంచి మొదలైన చంద్రబాబు కుప్పం పర్యటన మూడు రోజుల పాటు కొనసాగనుంది. ‘పదే పదే కుప్పం వెళ్తున్న బాబు గారు, కుప్పం మీద ప్రేమ పుట్టిందా?, కుప్పం అంటే భయం పట్టిందా?’ అంటూ చంద్రబాబును ఉద్దేశించి వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/