పవన్ దీక్ష వెనుక ఉన్నది చంద్రబాబే – అంబటి రాంబాబు
విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటలవరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. దీక్ష అనంతరం వైసీపీ సర్కార్ ఫై నిప్పులు చెరిగారు. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలఫై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాలతోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం దీక్ష చేశాడని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. తమ పార్టీ అధికారం లో ఉందని.. టీడీపీ ఓటమి పాలు అవుతుందని బాధతోనే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని అన్నారు. తమ పార్టీ విశాఖ ఉక్కు పై చిత్త శుద్ధి తో పోరాటం చేస్తుందని అన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం టీడీపీ గానీ, జన సేన పార్టీలు ఎం చేశాయని ప్రశ్నించారు. ప్రజలు రిజక్ట్ చేసిన వ్యక్తి ఇప్పుడు 151 సీట్లు గెలుచుకున్న జగన్ పై విమర్శలు చేయడం హాస్యస్పదం అని అన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ఒక సారి చెగువీరా సిద్ధాంతం అని భగత్ సింగ్ అని మరో సారి మరో ఒక్కరు అని చెబుతున్నాడని అన్నారు.