భారత్కు రానున్న జెఫ్ బెజోస్!
అమెరికా : అమెరికాకు చెందిన ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ వ్వవస్థాపకుడు, సీఈవో జెఫ్ బెజోస్ వచ్చే వారం భారత్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పరిశ్రమ నాయకులతో సమావేశం కానున్నారు. ఈ మేరకు అధికార వర్గాలు తెలిపాయి. జనవరి 1516 తేదీల్లో రాజధానిలో జరిగిన చిన్న, మధ్యతరహా వ్యాపారాల కార్యక్రమానికి కూడా ఆయన హాజరయ్యే అవకాశముందని తెలుస్తోంది. దీనిపై అమెజాన్ మీడియా సంప్రదించగా ఎలాంటి స్పందన రాలేదు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/