మందడం, వెలగపూడిలో రైతుల 24 గంటల దీక్ష
54వ రోజుకి చేరిన రాజధాని రైతుల ఆందోళనలు
అమరావతి: రాజధాని రైతుల ఆందోళనలు 54వ రోజుకి చేరుకున్నాయి. నేటి బైక్ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించడంతో దీక్షా శిబిరాల్లోనే రైతులు నిరసన దీక్షలు చేయనున్నాయి. మందడం, తుళ్లూరులో ధర్నా జరగనుంది. వెలగపూడిలో 54వ రోజు రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. మిగతా రాజధాని గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు జరుగుతున్నాయి. రైతుల 24 గంటల దీక్షలు నేడు కొనసాగనున్నాయి. నేడు మందడం, వెలగపూడిలోనూ రైతులు 24 గంటల దీక్షకు కూర్చోనున్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/