షిరిడికీ వెళ్లనున్న రాజధాని రైతులు
57వ రోజు కొనసాగుతున్న రైతులు నిరసనలు
అమరావతి: రాజధాని రైతుల ఆందోళనలు 57వ రోజుకి చేరుకున్నాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో 57వ రోజు రిలే దీక్షలు జరగనున్నాయి. మిగతా రాజధాని గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. నేడు రైతులు 24 గంటల దీక్షలు నిర్వహించనున్నారు. నేడు మందడం, వెలగపూడిలోనూ రైతులు 24 గంటల దీక్షకు కూర్చోనున్నారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని రైతు కూలీలు, మహిళలు షిరిడి వెళ్లి మొక్కు తీర్చుకోనున్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/