అమరావతిలో బైక్‌, ట్రాక్టర్‌ ర్యాలీలు

44వ రోజుకు చేరిన రైతుల ఆందోళనలు

Amaravati farmers
Amaravati farmers

అమరావతి: అమరావతి రాజధాని గ్రామాల రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఏపికి మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా, ఏపి రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రాజధాని గ్రామాల రైతులు ఆందోళనబాట పట్టిన విషయం తెలిసిందే. రైతుల ఆందోళనలు 44వ రోజుకు చేరుకున్నాయి. ఆందోళనలో భాగంగా ఇవాళ రాజధాని గ్రామాల్లో ట్రాక్టర్‌, బైక్‌ ర్యాలీలు నిర్వహించనున్నారు. మందడం, తుళ్లూరులో రాజధాని రైతులు ధర్నా నిర్వహించనున్నారు. వెలగపూడిలో రైతుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. మిగతా గ్రామాల్లోనూ నిరసనలు కొనసాగుతున్నాయి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/