రాజధాని రైతుల ఆందోళన బాట

Amaravati farmers protest

Amaravati: అమరావతి రాజధాని గ్రామాల రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఏపీకి మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా, అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రాజధాని గ్రామాల రైతులు ఆందోళనబాట పట్టిన విషయం తెలిసిందే. రైతుల ఆందోళనలు 44వ రోజుకు చేరుకున్నాయి. ఆందోళనలో భాగంగా ఇవాళ రాజధాని గ్రామాల్లో ట్రాక్టర్‌, బైక్‌ ర్యాలీలు నిర్వహించనున్నారు. మందడం, తుళ్లూరులో రాజధాని రైతులు ధర్నా నిర్వహించనున్నారు. వెలగపూడిలో రైతుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. మిగతా గ్రామాల్లోనూ నిరసనలు కొనసాగుతున్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/