నూతన ఏడాది రోజునా ఆగని దీక్షలు

Amaravati Formers
Amaravati Farmers

అమరావతి: నూతన సంవత్సరం రోజున కూడా రాజధాని రైతులు నిరసనలు చేస్తున్నారు. రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని వారు సూచిస్తున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ జిఎన్‌ రావు కమిటీ ఇచ్చిన బోగస్‌ నివేదికను రద్దు చేయాలని అమరావతి రైతులు నినాదాలు చేశారు. నూతన సంవత్సరం సంతోషాలను పక్కన పెట్టి మరీ అమరావతి సాధనే లక్ష్యంగా రైతుల దీక్షలు చేస్తున్నారు. అమరావతిని రాజధానిగా కోనసాగించే వరకు దీక్షలు ఆగవని స్పష్టం చేశారు. అమరావతి పరిధిలోని అన్ని గ్రామాల్లోనూ గత 15 రోజులుగా దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/