పోలీసుల అదుపులో అమలాపురం అల్లర్ల కీలక నిందితుడు
జిల్లా పేరు మార్చొద్దంటూ గతంలో అన్యం సాయి ఆందోళన
అమలాపురం: అమలాపురంలో విధ్వంసం వెనుక అమలాపురానికి చెందిన అన్యం సాయి ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని అమలాపురం స్టేషన్కు తరలించారు. సాయిపై ఇప్పటికే రౌడీషీట్ తెరిచారు. కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చాలంటూ జిల్లాకు చెందిన దళిత సంఘాలు డిమాండ్ చేస్తూ ర్యాలీలు నిర్వహిస్తున్న సమయంలో జిల్లా పేరును మార్చొద్దంటూ అన్యం సాయి ఆందోళనకు దిగాడు.
ఈ క్రమంలో జిల్లా పేరును మారిస్తే కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ చొక్కా విప్పేసి కిరోసిన్ క్యాన్ చేతబట్టిన అన్యం సాయి వీడియోలు ప్రస్తుతం న్యూస్ ఛానెళ్లలో వైరల్గా మారిపోయాయి. ఆది నుంచి జిల్లా పేరును మార్చొద్దంటూ డిమాండ్ చేస్తున్న సాయి అమలాపురం అల్లర్లకు నేతృత్వం వహించాడంటూ పోలీసులు అనుమానిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/