‘మనసేమో ప్రజల మీద. తనువేమో వెండి తెర మీద’ అంటూ పవన్ ఫై అభిమానం చాటుకున్న ఏ ఎం రత్నం

‘మనసేమో ప్రజల మీద. తనువేమో వెండి తెర మీద’ అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫై అభిమానం చాటుకున్నారు ఏ ఎం రత్నం. పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటే చాలు రోమాలు నిక్క పొడుస్తాయి. చాలామంది హీరోలకు అభిమానులు ఉంటె పవన్ కళ్యాణ్ కు మాత్రం భక్తులు ఉన్నారు. చేసిన సినిమాలు తక్కువే కానీ..ప్రజల్లో మాత్రం ఎవరెస్ట్ అంత ఎత్తుకు పవన్ వారి గుండెల్లో ఉన్నారు. పవన్ అంటే పడిచచ్చే వారు ఉన్నారు. కేవలం సినీ ప్రేక్షకుల్లోనే కాదు సినీ ప్రముఖుల్లో కూడా అంతే అభిమానం చొరగొన్నారు.

అలాంటి పవన్ సినీ ప్రయాణానికి నేటితో 27 వసంతాలు పూర్తయింది. ఈ సందర్భంగా ఆయన అభిమాన నిర్మాత ఏ. ఎం రత్నం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఓ ఆసక్తికర వీడియో రిలీజ్ చేసారు. ‘మనసేమో ప్రజల మీద. తనువేమో వెండి తెర మీద. రెండింటిలోనూ ప్రజల మనసు చూరగొన్న పవన్ కళ్యాణ్ కు 27 సంవత్సరాల సినీ జీవితాన్ని..తొమ్మిది సంవత్సరాల రాజకీయ రంగ జీవితాన్ని పూర్తిచేసుకున్న సందర్భంగా వారికి నా శుభాకాంక్షలు. ఆయన ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనసారా కోరుకుంటున్నాను’ అని తెలిపారు. ప్రస్తుతం ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ.ఎం రత్నం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.