సహజీవనం తర్వాతే పెళ్లి చేసుకుంటా అంటూ షాక్ ఇచ్చిన అల్లు శిరీష్

మెగా హీరో అల్లు శిరీష్ మొత్తానికి ఓ హిట్ అందుకున్నాడు. ఇండస్ట్రీ లో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా..హిట్ మాత్రం అందుకోలేకపోయారు. ఈ తరుణంలో అల్లు శిరీష్ నటించిన ఊర్వశివో రాక్షసివో చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమాకు హిట్ టాక్ వచ్చిన నేపథ్యంలో చిత్ర యూనిట్ ‘యూత్ ఫుల్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్’ పేరిట నిన్న (ఆదివారం) భారీ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా అల్లు అర్జున్ హాజరై ఆకట్టుకున్నారు. హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో జరిగిన ఈ వేడుకలో అల్లు శిరీష్ పెళ్లి ఫై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

‘ఊర్వశివో రాక్షసివో’ చిత్రంలోని ముద్దు దృశ్యాల్ని సెన్స్ తో తెరకెక్కించామని, ఎక్కడ హద్దులు దాటలేదని హీరో అల్లు శిరీష్ తెలిపాడు. ఈ సినిమాలో ప్రేమ, సహజీవనం, పెళ్లి అంశాల్ని చర్చించామన్నాడు. వివాహ వ్యవస్థ పై తనకు బలమైన విశ్వాసం ఉందని చెప్పాడు. సహజీవనం తర్వాత పెళ్లాడితే బాగుంటుందనేది తన అభిప్రాయం అన్నాడు. తన పెళ్లి విషయంలో ఇంట్లో ఏమాత్రం ఒత్తిడి చేయడం లేదని పేర్కొన్నాడు.

అల్లు శిరీష్ – అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన ఈ చిత్రానికి రాకేశ్ శశి దర్శకత్వం వహించగా, అచ్చు రాజమణి సంగీతాన్ని సమకూర్చాడు. ‘మాయారే’ పాటను మాత్రం అనూప్ రూబెన్స్ స్వరపరిచాడు. రొమాంటిక్ కామెడీ జోనర్లో ఈ సినిమా తెరకెక్కింది. విరుద్ధమైన స్వభావాలు కలిగిన హీరో .. హీరోయిన్ చుట్టూ అల్లుకున్న కథ ఇది. ప్రేమిస్తున్నానంటూ వెంటపడే హీరో .. పెళ్లికి మాత్రం నో అంటూనే అతనితో రొమాన్స్ చేసే హీరోయిన్. ఆ ఇద్దరి రొమాన్స్ కి కామెడీ టచ్ ఇచ్చే సునీల్ .. వెన్నెల కిశోర్ .. పోసాని పాత్రలు. ఇక ఆమని వైపు నుంచి అమ్మ ఎమోషన్ .. ఇలా కథ అని వైపులా నుంచి ఆడియన్స్ కి కావాల్సిన ఎంటర్టయిన్ మెంట్ ను అందించడంతో, హిట్ టాక్ తెచ్చుకుంది.