మధు మంతెనను పరామర్శించిన బన్నీ

గత కొద్దీ నెలలుగా ఇండస్ట్రీ లో వరుస విషాదాలు నమోదు అవుతూనే ఉన్న సంగతి తెలిసిందే. ప్రతి రోజు ఎవరో ఒకరు కన్నుమూస్తున్నారు. ఈరోజు సోమవారం ప్రముఖ నిర్మాత మధు మంతెన తండ్రి మురళీరాజు అనారోగ్యంతో కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం గుండెపోటుకు గురి కావడం తో హైదరాబాద్ లోని ప్రవైట్ హాస్పటల్ లో చికిత్స తీసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు ఆరోగ్యం విషమించడం తో తుదిశ్వాస విడిచారు.

మురళీరాజు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు. మధు మంతెన హిందీలో ఎక్కువ సినిమాలను నిర్మించారు. తెలుగు, బెంగాలీలో కూడా నిర్మాతగా వ్యవహరించారు. బాలీవుడ్ లో గజినీ, సూపర్ 30, ఉడ్తా పంజాబ్, ’83 తదితర ఎన్నో హిట్ చిత్రాలను నిర్మించారు. కాగా స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ నిర్మాత మధు మంతెన నివాసానికి ఆయనను పరామర్శించారు.

ఇక బన్నీ సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో పుష్ప 2 చేస్తున్నాడు.