రామ్ చరణ్ బర్త్ డే వేడుకలో ఆ ఇద్దరు పాన్ స్టార్స్ మిస్ అయ్యారు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలు నిన్న (మార్చి 27) అట్టహాసంగా జరిగాయి. ఉదయం నుండి సోషల్ మీడియా లో అభిమానులు , సినీ ప్రముఖులు చరణ్ కు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. ఇక సాయంత్రం,హైదరాబాద్ లో చరణ్ బర్త్ డే వేడుకలు అట్టహాసంగా జరిపారు. ఇండస్ట్రీ నుండి చాలామంది ప్రముఖులు హాజరయ్యారు.

ఆర్ఆర్ఆర్ యూనిట్ తో పాటు అక్కినేని ఫామిలీ , మంచు మనోజ్ ఫ్యామిలీ, అల్లు అరవింద్ , అడవి శేష్, విజయ్ దేవరకొండ, శ్రీకాంత్, డివివి దానయ్య, ప్రేమ్ రక్షిత్, రాహుల్ సిప్లిగుంజ్, ప్రశాంత్ నీల్, నర్తన్, బి గోపాల్, కెఎస్ రామారావు, అశ్వినీదత్, కోదండరామిరెడ్డి, మైత్రి నవీన్-రవి, బివిఎస్ఎన్ ప్రసాద్, దిల్ రాజు, ఎన్వి ప్రసాద్ ఇలా చాలామందే హాజరయ్యారు. అయితే ఇద్దరు పాన్ ఇండియా స్టార్ హీరోలు మిస్ అవ్వడం కాస్త వెలితిగా కనిపించింది.

కొరటాల శివ సినిమాలో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ , పుష్ప 2 సినిమాతో బిజీ గా ఉన్న అల్లు అర్జున్ ఫంక్షన్ కు హాజరుకాలేకపోయారు. గత ఏడాది ఇదే సమయంలో ఆర్ఆర్ఆర్ పోస్ట్ రిలీజ్ మూడ్ లో ఉండటం వల్ల చరణ్ – ఎన్టీఆర్ లు సులభంగా కలుసుకున్నారు. కానీ ఈసారి ఆ కలయిక కుదరలేదు. అల్లు అర్జున్ వస్తాడేమో అనుకుంటే అరవింద్ మాత్రమే దర్శనమిచ్చారు.