రాజకీయాల్లోకి ఎంట్రీ ఫై అల్లరి నరేష్ క్లారిటీ

సినీ నటుడు అల్లరి నరేష్ రాజకీయాల్లోకి రాబోతున్నట్లు గత కొద్దీ రోజులుగా సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో వాటికీ క్లారిటీ ఇచ్చారు. తాజాగా అల్లరి నరేష్ నటించిన ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ మూవీ రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నాంది హిట్ తర్వాత నరేష్ నుండి వస్తున్న సినిమా కావడం , ట్రైలర్ , టీజర్స్ సైతం ఆకట్టుకోవడం తో సినిమా ఫై ఆసక్తి నెలకొంది.

ఏఆర్ మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో అల్లరి నరేష్ సరసన ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. అయితే, ఈ సినిమా పొలిటికల్‌ బ్యాగ్‌ బ్రాప్‌ లో వస్తున్న నేపథ్యంలో… నరేష్‌ రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరిగింది. అయితే.. దీనిపై నరేష్‌ స్పందించారు. రాజకీయాలు నాకు ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్ అని.. రాజకీయాల్లోకి రానని తేల్చి చెప్పారు. సున్నితంగా ఉండే నా లాంటి వాళ్ళకి రాజకీయాలు సరిపోవన్నారు.