పవన్ కు మీమంతా అండగా ఉంటాం – కన్నా లక్ష్మి నారాయణ

ఏపీలో వైస్సార్సీపీ vs జనసేన గా ఉన్న ఈ తరుణంలో బిఆర్ఎస్ ఏపీలో కొత్త చర్చ కు దారితీసింది. జనసేన ఫై ప్రజల్లో నమ్మకం పెరుగుతున్న క్రమంలో ఇప్పుడు కేసీఆర్ జనసేన పార్టీ కీలక నేతలను బిఆర్ఎస్ లో చేర్చుకోవడం అందర్నీ షాక్ లో పడేసింది. ఈ పరిణామంపై బిజెపి కాస్త ఘాటుగానే స్పందిస్తుంది. ఇప్పటికే తెలంగాణ బిజెపి నేతలు దీనిపై పలు కామెంట్స్ చేయగా..తాజాగా ఏపీ మాజీ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మి నారాయణ స్పందించారు.

ఏపీలో పవన్ కళ్యాణ్, తెలంగాణలో బండి సంజయ్ ని తగ్గించేందుకే సీఎం జగన్, కెసిఆర్ కలిసి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ కు మీమంతా ఉన్నామని తెలియజేసారు. అలాగే బిజెపి గుంటూరు జిల్లా అధ్యక్షుడిని మార్చడం పై సోము వీర్రాజు పై కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేసారు. కోర్ కమిటీలో చర్చించకుండానే జిల్లా అధ్యక్షులను మార్చారని అన్నారు. కోర్ కమిటీ సమావేశంలో తప్ప పార్టీలో ఏ ఇతర విషయాలు మాకు తెలియడం లేదన్నారు. తాను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎంతోమందిని బీజేపీలో జాయిన్ చేశానని.. ఇప్పుడు వారు ఎందుకు పార్టీ వీడుతున్నారో సోము వీర్రాజు సమాధానం చెప్పాలన్నారు.