రెండు నెలల తర్వాత తెరచుకోనున్నతాజ్ మహల్
ఆగ్రా : కరోనా మహమ్మారి కారణంగా మూతపడిన తాజ్మహల్ రెండు నెలల తర్వాత ఈ నెల 16న తెరచుకోనున్నది. తాజ్ మహల్తో పాటు పలు స్మారక చిహ్నాలను తిలకించేందుకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ జారీ చేసింది. కరోనా సెకండ్ వేవ్తో తాజ్ మహల్తో పాటు ఆగ్రా పోర్ట్ ఫతేపూర్ సిక్రీలతో సహా దేశవ్యాప్తంగా స్మారక చిహ్నాలను మూసివేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తగ్గుముఖం పడుతుండడంతో పర్యాటక రంగంపై ఆధారపడ్డ స్థానికులు తాజ్ మహల్, ఇతర స్మారక చిహ్నాలను తెరవాలని డిమాండ్ చేశారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/