ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతకు కరోనా

సునీత వద్ద పనిచేసే ఇద్దరు సిబ్బందికి కూడా కరోనా

mla-gongidi-sunitha

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతకు కరోనా సోకినట్టు తేలింది. గత కొన్ని రోజులుగా ఆమె జలుబుతో బాధపడుతుండగా గురువారం హైదరాబాద్‌లో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. శుక్రవారం వచ్చిన ఫలితాల్లో కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. సునీత వద్ద పనిచేసే ఇద్దరు సిబ్బందికి కూడా కరోనా సోకినట్టు తేలింది. దీంతో సునీత భర్త, టెస్కాబ్ వైస్ చైర్మన్ అయిన గొంగిడి మహేందర్‌రెడ్డితోపాటు మరికొందరికి పరీక్షలు నిర్వహించారు. ఫలితాలు రావాల్సి ఉంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/