నేడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ‘అలయ్ బలయ్’..

నేడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ‘అలయ్ బలయ్’ కార్యక్రమం జరగబోతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి హాజరు కాబోతున్నట్లు తెలుస్తుంది. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే అలయ్ బలయ్ కార్యక్రమం 17 ఏళ్ల నుంచి సాగుతూ వస్తోంది. బీజేపీ నేత, ప్రస్తుత హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ 17 ఏళ్ల కిందట ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఏడాది దసరా మరుసటిరోజు ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ఆ ఆనవాయితీ కొనసాగిస్తున్నారు.

హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానం వేదికగా నేడు నిర్వహించే అలాయ్ బలాయ్ వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న ఈ వేడుకకు మెగా స్టార్ చిరంజీవి , తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల గవర్నర్లు, పంజాబ్, హర్యానా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, కిషన్‌రెడ్డి, భూపేంద్ర యాదవ్‌ హాజరుకానున్నారు. అలాగే రాష్ట్ర మంత్రులైన మహముద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో పాటు బండి సంజయ్‌, రేవంత్‌రెడ్డి, కోదండారాం తదిదరులు పాల్గొననున్నారు.