షూటింగ్ లో గాయపడ్డ అక్షయ్ కుమార్

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ షూటింగ్ లో గాయపడ్డారు. ప్రస్తుతం అక్షయ్.. ‘బడే మియా ఛోటే మియా’ అనే యాక్షన్ మూవీ లో నటిస్తున్నాడు. ఈ మూవీ అక్షయ్ తో పాటు టైగర్‌ష్రాఫ్‌ కూడా నటిస్తుండడం విశేషం. అలీ అబ్బాస్‌ జాఫర్‌ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్ర షూటింగ్ స్కాట్‌లాండ్‌లో జరుపుకుంటుంది. హీరోలిద్దరిపై యాక్షన్‌ సన్నివేశాలు షూటింగ్ చేస్తున్నారు. స్టంట్స్‌ పర్‌ఫార్మ్‌ చేసే క్రమంలో అక్షయ్‌కుమార్‌ మోకాలికి తీవ్ర గాయమైనట్లు మేకర్స్ తెలిపారు.

కాలికి గాయమైనప్పటికీ , ఏమాత్రం లెక్కచేయకుండా ఆ బాధలోనే అక్షయ్ షూటింగ్‌ పూర్తి చేశారని, ముందస్తుగా ఖరారైన షెడ్యూల్‌ దృష్ట్యా చిత్రీకరణను పొడిగించలేకపోయామని నిర్మాత జాకీ భగ్నానీ తెలిపారు. గాయం కారణంగా యాక్షన్‌ సీక్వెన్స్‌కు బ్రేక్‌నిచ్చి అక్షయ్‌కుమార్‌పై కొన్ని క్లోజప్‌ సీన్లను షూట్‌ చేశామని దర్శకుడు పేర్కొన్నారు. ఈ మూవీ ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నట్లు తెలిపారు.