దేశ వ్యాప్తంగా ఎయిర్‌టెల్‌ వై-ఫై సేవలు ప్రారంభం

airtel wifi calling
airtel wifi calling

న్యూఢిల్లీ: టెలికం దిగ్గజ కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌ దేశ వ్యాప్తంగా వై-పై కాలింగ్‌ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది. నూతన సేవల ఆధారంగా వై-పై నెట్‌వర్క్‌లను కూడా వినియోగించుకొని కాల్స్‌్‌ చేయవచ్చని, దీంతో పాటు ఇళ్లలో లేదా ఆఫీసుల్లో కాల్స్‌ చేసేటప్పుడు నిరాటంకంగా ఎల్‌టీఈ నుంచి వై-పై మారవచ్చని వివరించింది. ఇందుకు కస్టమర్ల నుంచి ఎటువంటి అదనపు చార్జీలను వసూలు చేయడం లేదని స్పష్టం చేసింది. పైలట్‌ ప్రాజెక్టు కింద ఇప్పటికే అందుబాటులో ఉన్న సంస్థ సేవలకు విశేష స్పందన లభించిందని, వై-పై కస్టమర్ల సంఖ్య 10 లక్షలను అధిగమించిందని ఎయిర్‌టెల్‌ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/