కేంద్రానికి రూ. 10 వేల కోట్లు చెల్లించిన ఎయిర్టెల్!
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తీర్పు టెలికాంశాఖ ఆదేశాల నేపథ్యంలో ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ సోమవారం రూ.10 వేల కోట్ల బకాయిలు చెల్లించింది. మిగతా మొత్తాన్ని త్వరలోనే చెల్లిస్తామని వెల్లడించింది. బకాయిల చెల్లింపునకు డెడ్ లైన్ దాటిపోవడంపై సుప్రీంకోర్టు ఇప్పటికే టెలికం సంస్థలను మందలించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎయిర్టెల్ సంస్థ భారతీ ఎయిర్ టెల్, భారతీ హెక్సాకామ్, టెలినార్ తరపున ఈ డబ్బును చెల్లించామని, సుప్రీంకోర్టులో తదుపరి విచారణ జరిగేలోగా మిగతా బకాయిలను చెల్లించేందుకు ప్రయత్నిస్తామని ఎయిర్టెల్ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా పాత బకాయిలను తక్షణం చెల్లించాలని ఈ నెల 14న ఉత్తర్వులు వెలువడిన సంగతి తెలిసిందే. భారతీ ఎయిర్ మొత్తం రూ. 35,586 కోట్ల బకాయి ఉన్నట్లు తెలుస్తోంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/