వుహాన్ వెళ్లిన ఎయిరిండియా
న్యూఢిల్లీ: వుహాన్లో పుట్టుకొచ్చిన కరోనా వైరస్ కారణంగా చైనాలో ఉన్న భారతీయులను తీసుకొచ్చేందుకు ప్రభుత్వ రంగ విమానయానసంస్థ ఎయిరిండియాకు చెందిన జంబో విమానం బీ747 వుహాన్కు బయలుదేరింది. ఢిల్లీ నుంచి మధ్యాహ్నం బయలుదేరినట్లు అధికారులు వెల్లడించారు. శనివారం తెల్లవారుజామున 2 గంటలకు తిరిగి భారత్కు చేరుకుంటుంది. వుహాన్ నుంచి మొత్తం 400 మంది భారతీయులను ఈ విమానం స్వదేశానికి తీసుకురానుంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఐదుగురు వైద్య నిపుణులు ఇందులో వెళ్తున్నారు. విమాన సిబ్బందికి, ప్రయాణికులకు అవసరమైన మాస్క్లను వెంట తీసుకెళ్తున్నారు. కాగా వుహాన్ నుంచి వచ్చిన భారతీయులను కేంద్ర విదేశాంగశాఖ, ఆరోగ్యశాఖ తగిన ఏర్పాట్లు చేసిందని ఎయిరిండియా సీఎండీ అశ్విని లోహానీ తెలిపారు. అయితే వుహాన్ నుంచి ఎయిరిండియా తిరిగి వచ్చిన తర్వాత అందులోని భారతీయులను 14 రోజుల పాటు ప్రత్యేక వార్డులో ఉంచి వైద్యులు పర్యవేక్షించనున్నారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/