చైనాకు ఎయిరిండియా సర్వీసులు నిలిపివేత!

ప్రకటన చేయనున్న సంస్థ సీఎండీ

Airindia
Airindia

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌తో (కొవిడ్‌-19) చైనాతో పాటు పలు దేశాలు హడలిపోతున్నారు. ప్రపంచ దేశాలు చైనాతో సంబంధాలను పరిమితం చేసుకున్నాయి. అనేక విమానయాన సంస్థలు చైనాకు తమ సర్వీసులు నిలిపివేశాయి. భారత ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా కూడా చైనాకు అన్ని రకాల సర్వీసులను నిలిపివేయాలని నిర్ణయించింది. జూన్ 20 వరకు చైనాకు విమానాలు నడపరాదని భావిస్తోంది. కరోనా వైరస్ కారణంగా చైనాలో ఇప్పటివరకు 2 వేలకు పైగా మరణాలు సంభవించాయి. ఈ ప్రమాదకర వైరస్ బారినపడిన వారి సంఖ్య వేలల్లో ఉంది. ఈ నేపథ్యంలో చైనాలో పరిస్థితులపై సమీక్షించేందుకు ఎయిరిండియా అత్యున్నత నిర్ణాయక కమిటీ బుధవారం సాయంత్రం సమావేశమైంది. ఇలాంటి పరిస్థితుల్లో చైనాకు విమానాలు నడపకపోవడమే మంచిదని ఓ నిర్ణయానికి వచ్చారు. దీనిపై ఎయిరిండియా సీఎండీ ఓ ప్రకటన చేస్తారని తెలుస్తోంది.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/