క్షీణించిన అహ్మద్ పటేల్ ఆరోగ్యం
గురుగాన్లోని వైద్యశాలలో చికిత్స
New Delhi: కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ఆరోగ్యం క్షీణించింది.. పరిస్థితి విషమంగా ఉంది.. అక్టోబర్ 1న ఆయనకు కోవిడ్ పాజిటివ్కు గురయ్యారు..
వెంటనే ఆరోగ్య సమస్యలు తలెత్తాయి.. ప్రస్తుతం ఆయన గురుగాన్లోని మేదాంత ఆసుపత్రిలో ఐసియులో చికిత్సపొందుతున్నారు.
ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్కు గురికావటంతో ఆ ప్రభావం కీలక అవయవాలపై పడిందని వైద్యులు తెలిపారు..
ఇదిలా ఉండగా, ‘నాన్నగారి పరిస్థితి నిలకడగా ఉంది, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతోందని త్వరగా కోలుకునేలా అంతా ప్రార్థించాలని కోరుకుంటున్నట్టు ఆయన కుమారుడు ఫైసల్ పటేల్ ట్వీట్ చేశారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/