మా నిధులు మాకిచ్చేయండి .. లేకపోతే ప్రపంచదేశాలు ఇబ్బంది పడతాయి: తాలిబన్లు

ఆప్ఘన్ నిధులను స్తంభింపజేసిన అమెరికా

కాబుల్: తాలిబన్లు ఆప్ఘనిస్థాన్ ను చేజిక్కించుకున్న తర్వాత ఆ దేశానికి చెందిన నిధులను అమెరికా స్తంభింపజేసిన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాలిబన్ ప్రభుత్వం నిధులు లేక అల్లాడిపోతోంది. విదేశాల నుంచి వచ్చే దిగుమతులు కూడా తగ్గిపోవడంతో… ఆప్ఘనిస్థాన్ లో ఆహార సమస్య కూడా పెరుగుతోంది. శీతాకాలంలో ఆహార సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది.

ఈ క్రమంలో ప్రపంచ దేశాలకు తాలిబన్లు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తమకు రావాల్సిన 9 బిలియన్ డాలర్లను వెంటనే విడుదల చేయాలని చెప్పారు. లేనిపక్షంలో ఆఫ్ఘనిస్థాన్ నుంచి వలసలు పెరుగుతాయని… ఆ వలసలతో ప్రపంచ దేశాలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. తమ సెంట్రల్ నిధులను, ఆస్తులను అమెరికా స్తంభింపజేయడం ఆశ్చర్యకరంగా ఉందని తాలిబన్ నేతలు అన్నారు. దోహా ఒప్పందానికి విరుద్ధంగా అమెరికా ప్రవర్తిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/