కారు బాంబు దాడి..ఐదుగురు సైనికులు మృతి

bomb-blast
bomb-blast

కాబూల్‌: ఆప్ఘన్‌లోని హెల్మాండ్‌ దక్షిణ ప్రావిన్స్‌లో బుధవారం కారు బాంబు దాడి సంభవించింది. ఈ దాడిలో ఐదుగురు సైనికులతోపాటు నలుగురు సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రావిన్షియల్‌ గవర్నర్‌ అధికార ప్రతినిధి ఒమర్‌ జ్వాక్‌ తెలిపారు. దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్లు ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకోలేదు. తాలిబన్లే ఈ హింసాత్మక ఘటనకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాలిబ‌న్లతో శాంతి చ‌ర్చ‌లు జరుగుతున్నా ఆప్ఘన్‌లో వరుస బాంబుదాడులు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కాగా మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులున్నట్లు అధికార ప్రతినిధి ఒమర్‌ జ్వాక్‌ వెల్లడించారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/