జగన్ బెయిల్ రద్దు పిటిషన్ విచారణ 26కి వాయిదా
కౌంటర్ దాఖలుకు మరోసారి గడువు కావాలంటూ కోర్టును కోరిన జగన్, సీబీఐ తరపు న్యాయవాదులు
ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలన్న ఎంపీ రఘురామ కృష్ణ రాజు పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది. కౌంటర్ దాఖలు చేసేందుకు మరోసారి గడువు కావాలంటూ జగన్, సీబీఐ తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. దీంతో కౌంటర్ దాఖలు చేసేందుకు జగన్, సీబీఐకి కోర్టు చివరి అవకాశం ఇస్తూ విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/