‘జి2’ తో వస్తున్న గూఢచారి సీక్వెల్

అడివిశేష్ హీరోగా , శశి కిరణ్ తిక్క డైరెక్ట్ చేసిన మూవీ గూఢచారి. 2018 లో విడుదలై సూపర్ హిట్ సాధించిన ఈ మూవీ కి ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. ‘జి2’ పేరుతో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీనికి సంబదించిన ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేసారు. మేజర్ చిత్రంతో ప్యాన్ ఇండియా స్థాయికి చేరుకున్న శేష్.. గతేడాది హిట్ 2 చిత్రంతో మరో విజయం సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ‘గూఢచారి’ సీక్వెల్‌ కోసం సిద్ధం అవుతున్నాడు. ‘జి2’ ఫస్ట్ లుక్ లో ఫార్మల్ వేసుకున్నశేష్ బిల్డింగ్ పై నుంచి దూకుతూ తుపాకీ గురి పెట్టినట్లు పోస్టర్ లో చూపించారు.

ఈ మూవీ లో శేష్‌ను ఇండియా నుంచి ఆల్ప్స్ పర్వతాల వరకు వెళ్లే గూఢచారిగా చూపించారు. గూఢచారి తొలి భాగం హిట్ తో శేష్ కెరీర్ ఊపందుకోగా.. రెండో పార్టుతో తను మరో స్థాయికి చేరుకునేలా ఉన్నాడు. ఈ చిత్రం కోసం శేష్ ప్రత్యేకంగా మేకోవర్ అయి మరింత స్టయిలిష్ గా కనిపిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. మేజర్ చిత్రానికి ఎడిటర్ గా పనిచేసిన వినయ్ కుమార్ సిరిగినీడి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా సినిమాను ఏకే ఎంటర్‌టైనమెంట్స్, పీపుల్ మీడియా, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.