మే 9న ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్

మే 9న ఆదిపురుష్ ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటన చేసారు. ప్రభాస్ – కృతి సనన్ జంటగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రనౌత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ ఆదిపురుష్. సాహో, రాధేశ్యామ్ సినిమాల తర్వాత రాబోతున్న ఈ మూవీ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఇక ఈ సినిమాకి సంబంధించి మే 9న ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు అధికారిక ప్రకటన చేసారు. కొన్ని సెలెక్టెడ్‌ థియేటర్లలో త్రీడీ ట్రైలర్‌ను కూడా ప్రదర్శించబోతున్నారట. ఈ మేరకు అప్డేట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. అంతే కాకుండా ఆదిపురుష్‌ ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు భారీగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలో ఈ వేడుక నిర్వహించనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ట్రైలర్ రిలీజ్ మొదలుకొని.. వరుసగా మూవీ ప్రమోషన్స్ జరగనున్నాయి. ఇందుకోసం.. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నగరాలలో ఈ ఈవెంట్స్ జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు.

రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో సైఫ్‌ అలీఖాన్‌ లంకాధిపతి రావణాసురుడుగా కనిపిస్తుండగా రాముడి గా ప్రభాస్ , సీతగా కృతి కనిపించనున్నారు. టీ-సిరీస్‌, రెట్రో ఫైల్స్ సంస్థలు అత్యంత భారీ బడ్జెట్‌తో దాదాపు రూ.500 కోట్లతో ఈ సినిమాను నిర్మించాయి. ఇక ఈ సినిమాను జూన్‌ 16న పాన్‌ ఇండియా లెవల్లో గ్రాండ్‌గా రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.